న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. సోమవారం నుంచి జ్వరంతో బాధపడుతున్న ఆయన దాని నుంచి కోలుకున్నప్పటికీ బాగా నీరసంగా ఉన్నారు. దీంతో ఎయిమ్స్లో చేరారు. కాగా కొద్దికాలం కిందట మన్మోహన్సింగ్కు కరోనా సోకిన విషయం తెలిసిందే.