న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను కో-లొకేషన్ కేసులో సీబీఐ ఆదివారం అరెస్టు చేసింది. ఇప్పటికే సీబీఐ ఆమెను పలుమార్లు ప్రశ్నించింది. చిత్ర ముందస్తు బెయిల్ కోసం చేసుకొన్న దరఖాస్తును శనివారం ఢిల్లీ కోర్టు కొట్టేసింది. చిత్రా రామకృష్ణన్ సీఈవోగా ఉన్నకాలంలో ఎన్ఎస్ఈలో అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. ఆమె ఓ హిమాలయ యోగి ఆదేశాల మేరకు పనిచేశారని, కీలక సమాచారాన్ని లీక్ చేశారని, అనర్హులకు పదవులిచ్చారని పలు ఆరోపణలు ఉన్నాయి. ఆమెపై 2018 మేలో కేసు నమోదైంది.