మథుర: ఉత్తరప్రదేశ్లోని మథుర నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ హేమా మాలిని ఇవాళ ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. మథురను విజిట్ చేసిన ఆమెను విలేఖరులు ప్రశ్నలు సంధించారు. మథుర నియోజకవర్గం నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయని రిపోర్టర్లు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు హేమా మాలిని బదులిస్తూ.. కంగనా పోటీ చేయడాన్ని స్వాగతిస్తున్నాని, కానీ మీరు మథుర నుంచి కేవలం ఫిల్మ్ స్టార్స్ మాత్రమే పోటీ చేయాలని ఎందుకు భావిస్తున్నారా అని ఆమె అడిగారు. రాఖీ సావంత్ కూడా పోటీ చేయాలని మీరు ఇలాగే కోరుతారేమో అని హేమా మాలిని ఓ సెటైర్ కూడా వేశారు.