హైదరాబాద్ : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) మెడికల్ కాలేజీ, సనత్నగర్ ఫ్యాకల్టీ, క్లినికల్కు సంబంధించి 189 పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ను జారీచేసింది. ఫ్యాకల్టీ, సీనియర్ కన్సల్టెంట్(సూపర్ స్పెషాలిటీ), ఎంట్రీ లెవల్ జూనియర్ కన్సల్టెంట్స్, సూపర్ స్పెషలిస్ట్స్, బ్రాడ్ స్పెషాలిటీ కన్సల్టెంట్, సీనియర్ రెసిడెంట్స్, సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్, జూనియర్ రెసిడెంట్స్ పోస్టులకు ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి ప్రొఫెసర్స్-11, అసోసియేట్ ప్రొఫెసర్స్-25, అసిస్టెంట్ ప్రొఫెసర్స్-11, సీనియర్ కన్సల్టెంట్-7, ఎంట్రీ లెవల్ జూనియర్ కన్సల్టెంట్-17, అర్హులైన వైద్యుల నుండి స్పెషాలిటీ స్పెషలిస్ట్స్(జూనియర్ స్కేల్)-5, కన్సల్టెంట్(బ్రాడ్ స్పెషాలిటీ)-8, సీనియర్ రెసిడెంట్స్-80, సీనియర్ రెసిడెంట్(బ్రాడ్ స్పెషాలిటీ)-16, సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్-1, జూనియర్ రెసిడెంట్స్-3, జూనియర్ రెసిడెంట్స్(బ్రాడ్ స్పెషాలిటీ)-5 పోస్టులు.