లండన్: క్రీడల్లో సమానత్వానికి అన్ని సమాఖ్యలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పురుషులతో సమానంగా మహిళలకు సమాన నగదు ప్రోత్సాహం అందిస్తున్న వేళ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఆ దిశగా అడుగు ముందుకేసింది.ఇందులో భాగంగా అంతర్జాతీయ మహిళా క్రికెటర్లకు పురుషుల వలే వేతనం ఇచ్చేందుకు ఈసీబీ నిర్ణయం తీసుకుంది. పురుష, మహళా క్రికెటర్ల మధ్య ఉన్న వేతన సారూప్యతను రూపుమాపేందుకు ఈసీబీ ఒక స్వతంత్ర కమిషన్ను ఏర్పాటు చేసింది. సదరు కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ వారంలో శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ నుంచి వేతన సవరణ అమల్లోకి రానుంది.