దుబాయ్ : ప్రతి నెల ఐసీసీ అందజేసే ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు భారత మహిళా బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ నామినేట్ అయింది. ఆగస్టు నెలలో జెమీమీ చూపిన ప్రతిభకు ఆమెకు ఈ అవకాశం దక్కింది. మహిళా విభాగంలో జెమీమాతోపాటు ఈ అవార్డుకు ఆస్ట్రేలియా మహిళా బ్యాటర్లు బెత్ మూనీ, తహిలా మెక్గ్రాత్లుకూడా పోటీపడుతున్నారు. బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు ఫైనల్స్కు చేరుకోవడంలో జెమీమా పాత్ర మరువరానిది. ఆ టోర్నీలో ఆమె అయిదు మ్యాచ్లలో 146 పరుగులు సాధించి భారత జట్టులో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా నిలిచింది.