Elon Musk | న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా నేడు అత్యధికులు వినియోగించే జీమెయిల్ సేవలను గూగుల్ నిలిపివేయనున్నదన్న వదంతుల నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. జీమెయిల్కు పోటీగా ఎక్స్ మెయిల్ను తీసుకురానున్నట్టు తెలిపారు. ఎక్స్ మెయిల్ ప్రారంభం తేదీ ఎప్పుడంటూ ఎక్స్ సెక్యూరిటీ ఇంజినీరింగ్ టీమ్లోని సీనియర్ సభ్యుడు నాథన్ మెకగ్రాడి ట్వీట్ చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన మస్క్.. త్వరలోనే ఎక్స్ మెయిల్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
‘గూగుల్ ఈజ్ సన్సెట్టింగ్ జీ మెయిల్’ అంటూ గూగుల్ నుంచి వచ్చినట్టుగా చెబుతున్న ఓ మెయిల్కు సంబంధించిన స్క్రీన్షాట్ వైరలైంది. 2024 ఆగస్ట్ 1 నుంచి జీ మెయిల్ తన సర్వీస్ను నిలిపేస్తున్నట్టు అందులో ఉన్నది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో గూగుల్ అత్యవసరంగా స్పందించింది. జీ మెయిల్ ఆగిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. తన వినియోగదారులకు భరోసా కల్పించటానికి ఎక్స్ వేదికనే ఎంచుకున్నది.