న్యూఢిల్లీ: ఆఫ్రికాలోని నమీబియాకు చెందిన 8 చీతాలు ఇవాళ ఇండియాకు చేరుకున్నాయి. ప్రత్యేక విమానంలో ఆ చీతాలను గ్వాలియర్కు తీసుకువచ్చారు. మరికాసేపట్లో ఆ చీతాలను కూనో జాతీయ పార్క్కు తరలించనున్నారు. గ్వాలియర్లోని ఐఏఎఫ్ విమానాశ్రయంలో ప్రత్యేక విమానం దిగింది. చీతాలకు స్వల్ప స్థాయిలో మత్తు ఇచ్చి తీసుకువచ్చారు. అయితే అవి బాగానే ఉన్నాయని డాక్టర్ లౌరి మార్కర్ తెలిపారు. ఇవాళ ప్రధాని మోదీ బర్త్డే సందర్భంగా ఆ చీతాలను ఆయన కూనో ఫారెస్ట్లో వదలనున్నారు.