రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం (సీహెచ్ఎఫ్డబ్ల్యూ) 2021-22 విద్యాసంవత్సరానికి గాను ఏఎన్ఎం శిక్షణ కోసం ప్రకటన విడుదల చేసింది.
కోర్సు: మల్టీపర్పస్ హెల్త్ వర్కర్/ ఏఎన్ఎం ట్రెయినింగ్ కోర్సు
సీట్ల వివరాలు
ఆర్టీసీ (ఎఫ్) నిలోఫర్ హెల్త్ స్కూల్ గవర్నమెంట్ ఎంపీహెచ్డబ్ల్యూ (ఎఫ్) ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్- 40 సీట్లు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎంపీహెచ్డబ్ల్యూ (ఎఫ్) ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్, నిజామాబాద్- 40 సీట్లు, ఎంజీఎం హాస్పిటల్ ఎంపీహెచ్డబ్ల్యూ (ఎఫ్) ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్, వరంగల్- 20 సీట్లు, గవర్నమెంట్ ఎంపీహెచ్డబ్ల్యూ (ఎఫ్) ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్, ఖమ్మం- 40 సీట్లు, గవర్నమెంట్ ఎంపీహెచ్డబ్ల్యూ (ఎఫ్) ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్, కొత్తగూడెం (భద్రాది)- 40 సీట్లు ఉన్నాయి.
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
వయస్సు: 2021 డిసెంబర్ 31 నాటికి అభ్యర్థులు 17 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి నిబంధనలో ఐదేండ్ల సడలింపు ఉంటుంది.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆఫ్లైన్/ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.200
చివరితేదీ: డిసెంబర్ 18
శిక్షణ ప్రారంభం: 2022 జనవరి 1
పూర్తి వివరాల కోసం వెబ్సైట్:
https://chfw.telangana.gov.in /home.do