న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ గ్రూపు సూపర్టెక్ ప్రమోటర్ ఆర్కే ఆరోరా(RK Arora)ను.. మనీల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. బుధవారం రోజున ఆయన్ను ప్రత్యేక కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. ఆరోరా కస్టడీని ఈడీ కోరే అవకాశాలు ఉన్నాయి. మూడు రౌండ్ల పాటు ప్రశ్నించిన తర్వాత ఆరోరాను పీఎంఎల్ఏ చట్టం కింద అరెస్టు చేశారు. ఢిల్లీ, యూపీ, హర్యానా రాష్ట్రాల్లో ఆరోరాపై సుమారు 20 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. రియల్ ఎస్టేట్ సంస్థ వద్ద ఇండ్లు కొనుగోలు చేసిన వ్యక్తులే సూపర్టెక్ ఓనర్పై ఫిర్యాదు చేశారు. తమ వద్ద డబ్బులు తీసుకుని ఇండ్లు ఇవ్వలేదని ఆరోపించారు. ప్రజల్ని ఆరోరా మోసం చేసినట్లు ఈడీ తన ఫిర్యాదులో పేర్కొన్నది.