శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లోని కత్రాలో గురువారం తెల్లవారు జామున భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 3.6 తీవ్రతతో ఉదయం 5.08గంటలకు ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. శ్రీనగర్కు 163 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు ఎన్సీఎస్ పేర్కొంది. అయితే, ఇప్పటి వరకు నష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు రాలేదని అధికారులు పేర్కొన్నారు. తెల్లవారు జామున ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనం బయటకు పరుగులు పెట్టారు. ఇదిలా ఉండగా.. బుధవారం కేరళ త్రిస్సూర్లోనూ భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 2.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి.