త్రిపుర : అగర్తలాలోని బ్లడ్ సన్ క్లబ్లో ఏర్పాటు చేసిన దుర్గా పూజా మండపంలో (Fire Accident) మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పూజా మండపంతో పాటు దేవతా విగ్రహం పూర్తిగా దగ్ధమయ్యాయి. మండపంలో పనులు జరుగుతుండగా షార్ట్సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. పూజా మండపంలో అగ్నిప్రమాదం జరగడం పట్ల త్రిపుర సీఎం మాణిక్ సాహ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నదన్నారు.
క్లబ్ సభ్యులందరూ అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని కోరారు. అగ్నిప్రమాదంతో దగ్ధమైన దుర్గా పూజా మండపాన్ని సీఎం సందర్శించారు. పూజా మండపాలను నిర్మించే వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.
Read More :