అమరావతి : చలితీవ్రత కారణంగా ఏర్పడుతున్న పొగమంచు వల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం ఉదయం శ్రీసత్యసాయి జిల్లా అగళిలో పొగమంచు కారణంగా ముందువెళ్తున్న ఎడ్ల బండిని లారీ ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఎడ్లబండిపై ఉన్న ఇద్దరు మృతి చెందగా లారీలోని ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని మడకశిర ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.