అహ్మదాబాద్ : ముంబై – అహ్మదాబాద్ హైవేపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటన గుజరాత్లోని వల్సాద్ జిల్లా పార్ది గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ట్రక్కులు ఢీకొట్టుకోవడంతో మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపకశాఖ సిబ్బందికి సమాచారం అందించగా.. మూడు ఫైర్ టెండర్లను సంఘటనా స్థలానికి తరలించిన మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు. ప్రమాదంలో ఒక ట్రక్కు డ్రైవర్ మృతి చెందాడని పేర్కొన్నారు. మంటల్లో రెండు లారీలు కాలిబూడిదయ్యాయి. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.