దోరేపల్లి సర్పంచ్, సెక్రటరీపై ఎమ్మెల్యే నరేందర్రెడ్డి మండిపాటు
మద్దూర్, ఫిబ్రవరి 7: ప్రభుత్వం కోట్లాది రూపాయలు గ్రామాభివృద్ధికి మంజూరుచేస్తే అభివృద్ధి చేయకపోవడమేంటని మండలంలోని దోరేపల్లి సర్పంచ్, కార్యదర్శిపై ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం దోరేపల్లి గ్రామసభకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి సుమారు కోటి రూపాయలు మంజూరైతే గ్రామంలో ఎక్కడి చెత్త అక్కడే ఉంచి డ్రైనేజీ నిర్మించకపోతే ఎలా అని సర్పంచ్ చంద్రకళ, కార్యదర్శి రాహుల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే ఉంటే మరోసారి వచ్చినపుడు సహించేదిలేదన్నారు. అనంతరం గ్రామంలోని రైతువేదికను ప్రారంభించి రైతువేదిక స్థలదాత ఇమామ్ను ఎమ్మెల్యే సన్మానించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని గ్రామానికి మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం మద్దూర్ మండల కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం దామ్లతండాలో శ్మశానవాటికను ప్రారంభించారు. అనంతరం పొర్లకుంట తండాలో బీటీరోడ్డు, క్రిమిటోరియాన్ని ప్రా రంభించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ న్ రామకృష్ణ మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, టీఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షుడు వెంకటయ్య, జెట్పీటీసీ రఘుపతిరెడ్డి పాల్గొన్నారు.
కులవృత్తులకు ప్రోత్సాహం
గత ప్రభుత్వాల హయాంలో కులవృత్తులను పట్టించుకునేవారు కాదని టీఆర్ఎస్ హయాంలో కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామన్నారు. వేసవిలో కుమ్మరన్న గుర్తుకొస్తాడని వారి కళ అద్భుతమని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. కోస్గి పట్టణంలోని శివాజీచౌక్లో కుమ్మరులు ప్రదర్శించిన వస్తువులను చూసి వారిని అభినందించారు. వారి కులవృత్తికి స్థలం కావాలని అడగడంతో తాసిల్దార్తో మాట్లాడి ఇప్పించేందుకు ప్రయత్నిస్తానన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, జెట్పీటీసీ ప్రకాశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.