న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్లతోపాటు వంటింట్లో వంట గ్యాస్ సిలిండర్ ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఒక సిలిండర్పై రూ.140 పెరిగింది. జూన్లో ధరలు యధాతథంగానే ఉన్నాయి కూడా.. గురువారం నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.25 పెరిగింది. 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.834.50 కాగా, 19 కిలోల సిలిండర్ ధర రూ.76 పెరిగి రూ.1,550కి చేరుకున్నది.
ముంబై, కోల్కతాల్లోనూ 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.834.50 కాగా, చెన్నైలో రూ.850.50కి పెరిగింది. తాజాగా కేంద్రం ప్రకటించిన నిర్ణయం ప్రకారం జూలై ఒకటో తేదీ నుంచి ప్రతి నెలా ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతుంది.
మరోవైపు పలు మెట్రోపాలిటన్ నగరాల్లో పెట్రోల్ లీటర్ ధర మూడంకెల డిజిట్ దిశగా ప్రయాణిస్తున్నది. హైదరాబాద్ సహా పలు నగరాల్లో ఇప్పటికే రూ.100 దాటేసింది. ఎల్పీజీ సిలిండర్ను కేవలం మార్కెట్ ధరకే కేటాయిస్తారు. ప్రభుత్వం ఎంపిక చేసిన వర్గాలకు సబ్సిడీ అందిస్తుంది.
ఫిబ్రవరిలోనే మూడు దఫాలు ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెంచేశాయి ముడి చమురు సంస్థలు. ఫిబ్రవరి నాలుగో తేదీన రూ.25, తిరిగి ఫిబ్రవరి 25న రూ.25 పెంచాయి. మార్చిలో రూ.25 పెంచారు. ఏప్రిల్లో రూ.125 పెంచేశాయి ముడి చమురు సంస్థలు.
2014లో సబ్సిడీపై సరఫరా చేసే ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.414 మాత్రమే. కానీ కేంద్రంలో 2014 బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడేండ్లలో రూ.420 పెరిగి రూ.834.50లకు చేరుకున్నది. వివిధ కారణాలతో సిలిండర్ ధర పెరగడంతో సామాన్యులకు ఇచ్చే సబ్సిడీ కూడా తగ్గిపోయింది.