న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశీయ ఫిన్టెక్ దిగ్గజం భారత్పే ‘భారత్పే వన్’ పేరుతో ఓ ఆల్-ఇన్-వన్ పేమెంట్ ప్రొడక్ట్ను ప్రారంభించింది. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) వాడకం, క్యూఆర్ కోడ్ స్కానిం గ్, ట్యాప్ అండ్ పే, స్పీకర్ ఇలాంటివన్నింటినీ ఒకే డివైజ్లో అందుబాటులోకి తెచ్చింది. తొలి దశలో దేశవ్యాప్తంగా దాదాపు 100 నగరాల్లోకి ఈ డివైజ్ను తీసుకెళ్లాలని చూస్తున్నామని, ఈ క్రమంలోనే వచ్చే 6 నెలల్లో సుమారు 450 నగరాల్లోకి తెస్తామని కంపెనీ ఈ సందర్భంగా ఓ ప్రకటనలో తెలియజేసింది.
‘హై-డెఫినిషన్ టచ్స్క్రీన్ డిస్ప్లే, 4జీ, వైఫై కనెక్టివిటీ, ఆధునిక ఆండ్రాయిడ్ ఓఎస్తో పనిచేసే ఈ భారత్పే వన్తో.. వినియోగదారులకు సులువైన, సురక్షితమైన లావాదేవీలకు వీలుంటుంది’ అని కంపెనీ పేర్కొన్నది. యూజర్-ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్, పోర్టబుల్ డిజైన్, సమగ్రమైన ట్రాన్జాక్షన్ డ్యాష్బోర్డులున్న ఈ డివైజ్.. ఆఫ్లైన్ మర్చంట్లకూ ఉపయోగకరంగా ఉంటుందన్నది.