కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో అంతర్లీనంగా అమానవీయ విభజనలు జరుగుతున్నాయన్నది భయాన్ని కలిగించే నిజం. బయటి దేశాలతో ప్రధాని మోదీ బ్రహ్మాండమైన సంబంధాలు నెరుపుతున్నారని, ప్రపంచంలోనే బలమైన రాజకీయ నాయకుడిగా ఎదిగాడని ఆయన భజనపరుల ప్రచారం. ఈ ప్రచారాల ముసుగులో దేశాన్ని పరిపాలించడంలో తమ వైఫల్యాలు దాచాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. కార్యకర్తల దగ్గరి నుంచి, ప్రధానిదాకా బీజేపీ వారికి ఉన్న సమర్థత ఒక్కటే! అబద్ధాలైనా పెద్దగొంతుతో అరిచిచెప్పడం. ప్రత్యర్థులన్న వారిమీద లేనిపోని కథలల్లి దేశ వ్యతిరేక శక్తులుగా ముద్రవేయటం. కేంద్ర పాలనా యంత్రాంగంతో దాడులు చేయిస్తూ వేధించటం. బీజేపీ వారు ఇతర పార్టీల వారితో సరైన చర్చలతో ఎప్పుడూ మాట్లాడరు. ఎందుకంటే వారి అబద్ధాలు నిరూపించటం చాలా తేలిక గనుక! తమకు అనుకూల మీడియాలోనూ, టీవీ ఛానెల్స్లోనూ, చెప్పిన అబద్ధాలే పదే పదే చెప్పటం వారికి అలవాటు. అబద్ధాలను ఒక కళగా అభివృద్ధి చేసిన ఘనత బీజేపీదే.
ఇక తెలంగాణ విషయానికి వస్తే, దేశంలో మిగతా రాష్ర్టాల్లో ఉన్న సంస్కృతికి, ఈ ప్రాంత సంస్కృతికి చాలా భేదం ఉంది. కొన్ని శతాబ్దాల పాటు స్వతంత్ర, సంపన్నదేశంగా ఉన్న తెలంగాణలో అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషల వారు కలిసిమెలిసి ఉంటారు. ఇతర రాష్ర్టాల నుంచే కాక, ఇతర దేశాల నుంచి కూడా వివిధ సంస్కృతులకు చెందినవారు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. తరతరాలుగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ తెలంగాణ సంస్కృతిలో మమేకమై ఈ ప్రాంతాన్ని ఒక సాంస్కృతిక మేళవింపు జరిగిన సుసంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దారు.
ప్రపంచంలోని ప్రతి మనిషి ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి మనిషీ పక్కవారిని అర్థం చేసుకొని అందరి జీవితం సుఖంగా మారటానికి తనవంతు గా కృషిచేయాలి. ఈ క్రమంలో మనల్ని మనమే మార్చుకోవాలి. అబద్ధాలు చెప్పి కొన్ని విజయాలు సాధించిన బీజేపీ ఆయా ప్రజలకు చేసిన మేలు ఏమన్నా ఉన్నదా? చెప్పిన మాటలు, ప్రమాణాలు నెరవేర్చిందా అని ప్రజలు విశ్లేషించుకోవాలి.
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు పసుపు బోర్డు తెచ్చాడా? మిగతా ప్రమాణాలు నెరవేర్చాడా? దుబ్బాక శాసనసభ్యుడు తను చెప్పినట్టు కేంద్రం నుంచి నిధులు తెచ్చి, ఆ నియోజకవర్గాన్ని స్వర్గం చేశాడా?నిన్న గెలిచిన హుజూరాబాద్ శాసనసభ్యుడిది ఇంకో కథ. వామపక్ష భావజాలంతో మొదలైన ఆయన మత రాజకీయాలు చేసే పార్టీలో ఎందు కు చేరారో తెలుసుకోవటం పెద్ద కష్టం కాదు. ఏపీ కి చెందిన టీడీపీ నాయకుల్లో ముగ్గురు ఎంపీలు తమ అవినీతి బయటపడినా కేంద్రం లో అధికారంలో ఉన్న పార్టీ తమని రక్షిస్తుందని బీజేపీ శరణు కోరిన తీరును దేశం మొత్తం చూసింది. అంతేకాదు, నిన్నమొన్న బెంగాల్లో ప్రలోభపడి, భయపడి బీజేపీలో చేరిన నేతలంతా తిరిగి తృణమూల్ కాంగ్రెస్లో చేరటం చూస్తున్నాం. వీరే కాదు, దేశంలో మిగతా రాష్ర్టా ల్లో బీజేపీలో చేరుతున్న నాయకుల చరిత్రలు గమనిస్తే ఇదే విషయం తేటతెల్లమవుతుంది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే, దేశంలో మిగతా రాష్ర్టాల్లో ఉన్న సంస్కృతికి, ఈ ప్రాంత సంస్కృతికి చాలా భేదం ఉంది. కొన్ని శతాబ్దాల పాటు స్వతంత్ర, సంపన్నదేశంగా ఉన్న తెలంగాణలో అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషల వారు కలిసిమెలిసి ఉన్నారు. ఇతర రాష్ర్టాల నుంచే కాక, ఇతర దేశాల నుంచి కూడా వివిధ సంస్కృతులకు చెందినవారు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. తరతరాలుగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ తెలంగాణ సంస్కృతిలో మమేకమై ఈ ప్రాంతాన్ని ఒక సాంస్కృతిక మేళవింపు జరిగిన సుసంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దారు.
సీమాంధ్ర సంకెళ్ళ నుంచి బయటపడి స్వరాష్ట్రంలో ప్రశాంత జీవనం గడుపుతు న్న తెలంగాణ వారికి కొత్త ముప్పుగా బీజేపీ పరిణమించింది. ‘గంగాజమునా తెహజీబ్’ అని పొగడబడిన తెలంగాణ ప్రజలను మతపరంగా రెచ్చగొడుతూ తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నది. విభిన్న సంస్కృతులను ఆదరించిన తెలంగాణ ప్రజలకు ఈ సంకుచిత భావాలు కలిగిన మతతత్వ పార్టీ బీజేపీ సరిపోతుందా? ప్రజలు ఆలోచించాలి, చర్చించుకోవాలి. ప్రశాంతతా? అశాంతా? ఏది కావాలో తేల్చుకోవాలి. మన భావ వైశాల్యం, అన్ని మతాల పట్ల, అన్ని భాషల పట్ల గౌరవం, సంస్కృతుల పట్ల ఆదరణ చూపించాలా? మన సోదరుల్లాగా శతాబ్దాలుగా ఇక్కడ బతుకుతున్న ఇతర మతాలవారితో విభేదాలు కావాలా? ప్రశాంతమైన, సుసంపన్న రాష్ర్టాన్ని రెండేండ్లుగా అశాంతిగా మార్చిన బీజేపీని తరిమికొట్టాలి. మన పిల్లలు, వారి తర్వాత తరాల వారు ఏ రకమైన జీవితం గడపాలో నిర్ణయించవలసిన బాధ్యత ఈ తరం మన మీద ఉంది.
తెలంగాణలో నాలుగు శతాబ్దాలు
ప్రశాంతంగా మత విభేదాలు, వైషమ్యాలు లేకుండా ప్రజలు జీవించారు. వారి మధ్య శత్రుత్వాలు సృష్టించబోతున్న ఆంధ్ర రాజకీయ నాయకులను తరిమికొట్టింది తెలంగాణ. అట్లాగే దక్షిణాది రాష్ర్టాల మీద చిన్నచూపు చూపిస్తూ, ఉత్తరాది ఆధిపత్యంతో తెలంగాణ రాష్ర్టాన్ని శత్రువు గా చూస్తున్న బీజేపీకి ఏమాత్రం చోటిచ్చినా పెద్ద ప్రమాదం. మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోవటానికే భయం గొలుపుతుంది.
ఏ విభేదాలున్నా, ఎవరితోనైనా బ్రతకవచ్చు. కానీ, సంకుచిత స్వభావాలున్న వారితో విశాల తత్వం ఉన్న మనుష్యులు సంతోషంగా బతుకలేరు. ఆ విషయం ఆంధ్రా వారి పొత్తుతో బాగా అర్థం చేసుకున్న తెలంగాణ ప్రజలు బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలి, ఉత్తర భారతదేశానికే పరిమితమైన ఆ పార్టీ విధానాలని వ్యతిరేకించి, సాధించిన తెలంగాణ రాష్ట్ర స్వతంత్రత, ప్రశాంతత కాపాడుకోవటానికి సమాయత్తమవుదాం.
కనకదుర్గ దంటు
89772 43484