రామాయంపేట, మార్చి 17 : ఆటోడ్రైవర్లు పరిమితికి మిం చి ప్రయాణికులను తరలిస్త్తే కఠిన చర్యలు తప్పవని సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్సై రాజేశ్ హెచ్చరించారు. గురువారం రామా యంపేటలోని సిద్దిపేట, మెదక్ చౌరస్తాల్లో ప్రయాణికుల ఆటోలకు రహదారి భద్రతా స్టిక్కర్లను అతికించి, అవగాహన కల్పించారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని ప్రమాదాల బారిన పడొద్దన్నారు. ద్విచక్ర వాహనాలపై ఇద్దరే ప్రయాణం చేయాలని, ముగ్గురు ప్రయాణించి ప్రమాదాలను కొని తెచ్చుకొవద్దన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయప డిన వారిని మానవత్వంతో దవాఖానకు తరలించి, చికిత్స చేయించాలని, ఇందుకు ఎలాంటి చర్యలు తీసుకోమ న్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆటోడ్రైవర్లు ఉన్నారు.
నిజాంపేట, మార్చి 17 : మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎస్సై శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఎస్పీ ఆదేశాలతో నిజాంపేట బస్టాప్ వద్ద మహిళల భద్రతపై ఆటో యూ నియన్ సభ్యులకు అవగాహన కల్పించారు. ప్రయాణికులు ముఖ్యంగా మహిళలకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఆటోడ్రైవర్ వివరాలు సూచించే స్టిక్కర్లను ఆటోపై ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రాజు, భిక్షపతి, ఆటో యూనియన్ సభ్యులు ఉన్నారు.
నర్సాపూర్, మార్చి 17 : పట్టణంలోని ఆటోడ్రైవర్లకు నర్సాపూర్ పోలీస్స్టేషన్లో సీఐ షేక్లాల్మదార్, ఎస్సై గంగరాజు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. రాంగ్ పార్కింగ్, ఎక్స్ట్రా ప్యాసింజర్స్, డాక్యుమెంట్స్ మెయింటనెన్స్, రోడ్డు నిబంధనలను తప్పకుండా పాటించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.