తమిళ హీరో సూర్య నటించిన కొత్త సినిమా ‘ఈటీ’ (ఎవరికీ తలవంచడు). ప్రియాంక అరుల్ మోహన్ నాయికగా నటిస్తున్నది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మాణంలో దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించారు. ఏషియన్ మల్టీప్లెక్స్ సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నది. తాజాగా సినిమా ట్రైలర్ను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..‘నాకు ఇష్టమైన హీరో సూర్య. ఆయన ఈటీ సినిమా తెలుగు ట్రైలర్ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. చిత్రబృందానికి శుభాకాంక్షలు’ అని అన్నారు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 10న తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం : డి. ఇమ్మాన్, సినిమాటోగ్రఫీ : ఆర్ రత్నవేలు.