గద్వాల అర్బన్, డిసెంబర్ 8 : విద్య, వైద్య, ఇతర అన్ని రంగాల్లో జోగుళాంబ గద్వాల జిల్లా అభివృద్ధి చెం దుతున్నదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ప్ర భుత్వ నర్సింగ్ కళాశాల డైరెక్టర్ లత పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. ముందుగా ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఈ ప్రాంతం వెనుకబడిపోయిందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఈ ప్రాంతంలో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయని చెప్పారు. జిల్లా దవాఖానలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. డయాలసిస్ సెంటర్ ఎందరో పేదలకు అండగా నిలుస్తున్నదన్నారు. త్వరలో గ్రామీణ ప్రాంతాల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గద్వాలకు నర్సింగ్ కాలే జీ రావడం సంతోషకరమన్నారు. ఇంటర్ పూర్తయిన మెరిట్ విద్యార్థినులు 15లోగా నర్సింగ్ విద్యకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంత రం నర్సింగ్ కాలేజీ డైరెక్టర్ లత మాట్లాడుతూ రా ష్ట్రంలో 13 నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేసినట్లు తె లిపారు. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ పేరు మీద నర్సింగ్ కాలేజీలో ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ ఏడాది 100 మందికి మాత్రమే అవకాశం ఉంటుందని చెప్పారు. త్వరలో సొంత భవనం కోసం ప్రభు త్వం రూ.40 కోట్లు నిధులు కేటాయించిందని తెలిపా రు. వివరాలకు సెల్ 9491848937, 63011021 33 నంబర్లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, సింగిల్ విండో చైర్మన్ సుభాన్, ఎంపీపీ ప్రతాప్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ కమల, వైస్ ప్రిన్సిపాల్ సత్యప్రియ, భాస్కర్రెడ్డి, బీచుపల్లి పాల్గొన్నారు.
12న గద్వాలలో ‘రైతన్న’ ప్రదర్శన
గద్వాల, డిసెంబర్ 8 : పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం సినీనటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిని కలిశారు. ఈ నెల 12న గద్వాలలోని నవరంగ్ థియేటర్లో రైతన్న సినిమా ప్రదర్శనకు సహకరించాలని కోరారు. వారం రోజుల పాటు సినిమా ప్రదర్శిస్తుండగా.. రైతులు పెద్ద సంఖ్యలో వచ్చేలా చూడాలన్నారు. 12న రైతులతో కలిసి సినిమా చూస్తానని ఎమ్మెల్యే బండ్ల తెలిపారు. అనంతరం నారాయణమూర్తిని ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ సుభాన్, ఎంపీపీ విజయ్, జెడ్పీటీసీ రాజశేఖర్, కేటీఆర్ యువసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్, మల్దకల్ ఆలయ కమిటీ చైర్మన్ ప్రహ్లాదరావు పాల్గొన్నారు.