చందంపేట, డిసెంబర్ 29 : సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం ‘మన ఊరు – మన ప్రభుత్వం – మన పథకాలు’ కార్యక్రమంలో భాగంగా చందంపేట మండలం బిల్డింగ్తండాలో రూ.20 లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. మండలంలోని మునావత్తండాలో రూ.22లక్షలతో నిర్మించనున్న మిషన్ భగీరథ ట్యాంక్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందుతుందని పేర్కొన్నారు. పేదింటి ఆడ బిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నూన్సావత్ పార్వతీచందునాయక్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు దొండేటి మల్లారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు బోయపల్లి శ్రీనివాస్గౌడ్, నేరేడుగొమ్ము జడ్పీటీసీ కేతావత్ బాలు, నాయకులు ఏర్పుల గోవిందుయాదవ్, రమావత్ మోహన్కృష్ణ, యాసాని రాజవర్ధన్రెడ్డి, సర్పంచులు రమావత్ సంతోష్కిషన్, లోక్యానాయక్, కేతావత్ శంకర్, వీరారెడ్డి, గోసుల అనంతగిరి, రామకృష్ణయాదవ్, కొండల్రెడ్డి, శోభన్నాయక్, దేవ, రమేశ్నాయక్, కృష్ణ, గోవర్ధన్ పాల్గొన్నారు.
దేవరకొండ రూరల్ : పీఏపల్లి మండలానికి చెందిన 64 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.64.71 లక్షల కల్యాణలక్ష్మి చెక్కలను గురువారం ఎమ్మెలే రమావత్ రవీంద్రకుమార్ తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెలుగూరి వల్లపురెడ్డి, వైస్ ఎంపీపీ అర్వపల్లి నర్సింహ, తోటకూరి పరమేశ్, మునగాల అంజిరెడ్డి, శీలం శేఖర్రెడ్డి, ఎర్ర యాదగిరి, కర్ణయ్య, శ్రీనివాస్యాదవ్, అచ్యుత్, కొండల్, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి : మండలంలోని చింతకుంట్ల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త పి. కాశయ్య మృతి చెందగా ఎమ్మెల్యే రవీంద్రకుమార్ గ్రామానికి వెళ్లి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి, రైతు బంధు మండలాధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్, వల్లపురెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కుంభం శ్రీనివాస్గౌడ్, మేకల శ్రీనివాస్యాదవ్, రావుల వెంకటయ్య, సత్యనారాయణ, వస్కుల కృష్ణయ్య, పేర్వాల వెంకటయ్య, వీరస్వామి ఉన్నారు.