నల్లగొండ : నల్లగొండలోని ప్రసిద్ధ పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో కస్తూరి ఫౌండేషన్ సహకారంతో మహా శివరాత్రి సందర్భంగా భక్తులకు మజ్జిగ ప్యాకెట్ల పంపణీని చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రారభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బ్రాంచ్ మేనేజర్ టి.మహేందర్, బ్యూరో ఇంచార్జి ఎం. మహేందర్ రెడ్డి, పత్రికా సిబ్బంది పాల్గొన్నారు.