న్యూఢిల్లీ: అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ సోమవారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ ముప్పులను ఎదుర్కోవడంపై చర్చించారు. ఈ సందర్భంగా గబ్బార్డ్కు ప్రధాని మోదీ గంగాజలం అందజేయగా, ప్రధానికి ఆమె రుద్రాక్షమాల బహూకరించారు. అంతకుముందు రక్షణమంత్రి రాజ్నాథ్తో గబ్బార్డ్ భేటీ అ య్యారు. ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్సింగ్ పన్నూపై చర్యలు తీసుకోవాలని రాజ్నాథ్ ఈ సందర్భంగా ఆమెను కోరారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో చేరారు. ఈ మాధ్యమాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆధ్వర్యంలోని ఓ సంస్థ నిర్వహిస్తున్నది.