హైదరాబాద్ : సూర్యాపేట జిల్లాలో డీజిల్ దొంగతనానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలోని సభ్యుడిని మునగాల పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి కోదాడ డీఎస్పీ రఘు నిందితుడిని మీడియా ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రి సమయంలో రోడ్డు వెంట ఆగి ఉన్న లారీల నుంచి ఈ ముఠా డీజిల్ దొంగతనం చేస్తుందని తెలిపారు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా, తెరికాడ్కు చెందిన ఆరుగురు ముఠాగా ఏర్పడి దొంగతనానికి పాల్పడుతోందని పేర్కొన్నారు. ముఠా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్లో చోరీలకు పాల్పడినట్లు చెప్పారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన ఐదుగురు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రెండు లారీలు, 2 సెల్ ఫోన్లు, రూ.30వేల నగదు, 400 డీజిల్ క్యాన్లతో పాటు పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని, మిగతా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వివరించారు.