రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసంతోపాటు శివునికి ప్రీతికరమైన సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. 45 వేలకుపైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా, సుమారు రూ.19 లక్షలకు పైగా ఆదాయం సమకూరినట్టు ఆలయ అధికారులు తెలిపారు.