చండీగఢ్: డేరా బాబాగా పేరుపడిన డేరా సచ్చా సౌధ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో జైలు అధికారులు ఆయనను రోహ్తక్లోని పీజీఐఎంఎస్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ప్రస్తుతం సునేరియా జైల్లో శిక్ష అనుభవిస్తున్న 53 ఏళ్ల డేరాబాబాను అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించేందుకు భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. వైద్యులు ఆయనకు సీటీ స్కాన్ సహా పలు వైద్య పరీక్షలు నిర్వహించారు.
అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ మళ్లీ తిరిగి జైలుకు తరలించారు. తన ఆశ్రమంలోని ఇద్దరు సాద్విలపై డేరా బాబా అత్యాచారానికి పాల్పడినట్టు తేలడంతో 2017 ఆగస్టులో సీబీఐ కోర్టు ఆయనకు 20 ఏండ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. నాటి నుంచి ఆయన రోహ్తక్లోని సునేరియా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు.