ఇండోనేషియా శాస్త్రవేత్తల వినూత్న పరిశోధన
న్యూఢిల్లీ, నవంబర్ 1: దోమల్లో మంచి దోమలు ఉంటాయి. చెడు దోమలు ఉంటాయి. డెంగ్యూ లాంటి వ్యాధులను కలుగజేసే ఏడిస్ ఈజిప్టి లాంటి దోమలు చెడ్డవైతే.. అదే డెంగ్యూను నివారించగల వోల్బాకియా అనే బ్యాక్టీరియాను కలిగి ఉన్న దోమలు మంచి దోమలు. ఈ రెండు రకాల దోమలు కలవడం వల్ల వాటికి పుట్టే దోమల్లో వోల్బాకియా బ్యాక్టీరియా ఉం టుందని, ఈ దోమలు కుట్టినా డెంగ్యూ వ్యాధి సోకదని ఇండోనేషియా శాస్త్రవేత్తలు గుర్తించారు. డెంగ్యూ నివారణకు ఈ మా ర్గంలో 2017 నుంచి పరిశోధనలు చేస్తున్నారు. డెంగ్యూ ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో వోల్బాకియా దోమలను వదిలి పెట్టారు. వీటిని ప్రవేశపెట్టిన చోట డెంగ్యూ కేసులు 77% తగ్గాయి. ఈ మేరకు పరిశోధన వివరాలను న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించారు.