న్యూఢిల్లీ : గుజరాత్కు చెందిన పారిశుధ్య కార్మికుడి కుటుంబానికి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా తన నివాసానికి వచ్చిన పారిశుధ్య కార్మికుడు హర్ష్ సోలంకికి కేజ్రీవాల్ స్వాగతం పలికి.. ఆలింగనం చేసుకున్నారు. సోలంకి సీఎంకు బీఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని బహూకరించారు. ఆ తర్వాత కేజ్రీవాల్తో కలిసి సోలంకి కుటుంబ సభ్యులు భోజనం చేశారు. ఈ విందులో ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా సైతం ఉన్నారు. అంతకు ముందు ఢిల్లీ విమానాశ్రయంలో సోలంకికి ఆప్ ఘన స్వాగతం పలికింది.
గుజరాత్ కో ఇన్చార్జి రాఘవ్ చద్దా సోలంకి కుటుంబానికి స్వాగతం పలికారు. విందు అనంతరం హర్ష్ సొలంకి కుటుంబం ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాల, ఆసుప్రతిని సందర్శించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమ్ ఆద్మీ పార్టీ ట్వీట్ చేసింది. ఆదివారం కేజ్రీవాల్ గుజరాత్లోని అహ్మదాబాద్లో పారిశుధ్య కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హర్ష్ సొలంకి కేజ్రీవాల్ను తన ఇంటికి విందుకు రావాలని ఆహ్వానించాడు. దీంతో కేజ్రీవాల్ సోమవారం ఢిల్లీలోని తన ఇంటికి కుటుంబంతో సహా రావాలని ఆహ్వానించారు.
Delhi CM @ArvindKejriwal hosts the family of Harsh Solanki from Gujarat for lunch at his residence. pic.twitter.com/mXldwX36Ck
— AAP (@AamAadmiParty) September 26, 2022
Gujarat से Delhi आए हमारे मेहमान, Harsh Solanki और उनके परिवार का हार्दिक स्वागत है 💐 pic.twitter.com/ywYFJlsxuk
— AAP (@AamAadmiParty) September 26, 2022