అమీర్పేట్, సెప్టెంబర్ 10: ఆలిండియా స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ద డెఫ్ ఆధ్వర్యంలో కోయంబత్తూరులో జరిగిన దక్షిణ మం డలం బధిర టీ20 క్రికెట్ టోర్నీలో తెలంగాణ జట్టు విజేతగా నిలిచింది. ఈనెల 7 నుంచి 9 వరకు కోయంబత్తూరులో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణతో పాటు పుదుచ్చేరి, కర్ణాటక, తమిళనాడు, కేరళ జట్లు పోటీపడ్డాయి. తమిళనాడుతో జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో తమ జట్టు విజయం సాధించిందని తెలంగాణ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ద డెఫ్ ప్రధాన కార్యదర్శి వలీవుద్దీన్ తెలిపారు. దీంతో ఈ నెల 18 నుంచి 24 వరకు మైసూరులో జరిగే జాతీయ టీ20 క్రికెట్ టోర్నీకి తెలంగాణ ఎంపికైందని పేర్కొన్నారు.