రవితేజ కథానాయకుడిగా తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ నేడు ప్రారంభోత్సవం జరుపుకోనుంది. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఇందులో ఓ కథానాయికగా కృతిససన్ సోదరి నుపూర్ సనన్ నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మరో నాయికగా ప్రముఖ మోడల్ గాయత్రీ భరద్వాజ్ నటించనుంది. ఆమెదికి తొలి చిత్రమని, అభినయ ప్రధానంగా పాత్ర సాగుతుందని చిత్రబృందం తెలిపింది. గాయత్రీ భరద్వాజ్ గతంలో మిస్ ఇండియా ఢిల్లీ టైటిల్ను గెలుచుకుంది. ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తారు. యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు.