అహ్మదాబాద్: భారత్ నిర్దేశించిన 225 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే ఆ జట్టు ఓపెనర్ జేసన్ రాయ్(0) బౌల్డ్ అయ్యాడు. కనీసం పరుగుల ఖాతా తెరవకుండానే ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఐతే రాయ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన డేవిడ్ మలన్ దూకుడుగా ఆడుతున్నాడు. మరో ఓపెనర్ బట్లర్ వేగం పెంచాడు. 6 ఓవర్లకు ఇంగ్లాండ్ వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. ప్రస్తుతం బట్లర్(23), మలన్(33) క్రీజులో ఉన్నారు.