హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): కొవిడ్ బారిన పడిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్నారు. 75 శాతం ఊపిరితిత్తులకు ఇన్ఫెన్షన్ సోకినట్టు వైద్యులు తెలిపారు. శివశంకర్ మాస్టర్ పెద్దకుమారుడు కూడా కరోనా మహమ్మారి బారిన పడి అపస్మారకస్థితికి చేరారు. శివశంకర్ భార్య కరోనాతో హోంక్వారెంటైన్లో ఉన్నారు. చిన్న కుమారుడు అజయ్ కృష్ణ ఒక్కడే తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు.