రచయిత జూలూరి గౌరీశంకర్
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకం దళితుల ఆర్థిక స్వాతంత్య్ర పొలికేకని ‘ఆత్మబంధువు’-దళిత సంక్షేమ బంధం గ్రంథ రచయి త, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దళితబంధుపై వెలువడిన తొలి గ్రంథంగా ఇది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సంపద పంపిణీ చేయకుండా సామాజిక అభ్యున్నతి సాధ్యంకాదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు చెప్పారు.