తూప్రాన్/రామాయంపేట/వెల్దుర్తి, నవంబర్ 15: మెదక్ జిల్లా వెలుర్ధి మండలం అచ్చంపేటలో దళితుల భూములను కాజేసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎమ్మెల్యే సభ్యత్వం తక్షణమే రద్దు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం మెదక్ జిల్లా తూప్రాన్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దళిత మహాసభ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న దళితులపై ఈటల మనుషులు దా డులు చేసి, అన్యాయంగా భూములు లాక్కొన్నారని మండిపడ్డారు. అచ్చంపేటలో అక్రమంగా సేకరించిన భూ ములను వారికి తిరిగి ఇచ్చేంతవరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. మెదక్ కలెక్టర్ చర్యలు చేపట్టి దళితుల భూములు దళితులకే చెందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.
ప్రభుత్వ భూముల కబ్జా ఫిర్యాదుపై హైకో ర్టు ఆదేశాల మేరకు మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హక్కీంపేట పరిధిలో ఈటలకు చెందిన జమున హ్యాచరీస్ భూములపై మంగళవారం నుంచి మూడు రో జులపాటు అధికారులు సర్వే చేపట్టనున్నారు. గతంలో జమున హ్యాచరీస్ యాజమాన్యం తమ భూములను కబ్జా చేసినట్టు హక్కీంపేట, అచ్చంపేట గ్రామాల రైతులు సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేశారు. సీఎం విచారణకు ఆదేశించారు. ముందస్తు సర్వే నోటీసులు అందించి, సర్వే చేయాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ భూములున్న ఎనిమిది సర్వే నంబర్లలోని కబ్జాలో ఉన్న 154 మంది రైతులతోపాటు జమున పరిశ్రయ యజమానులు ఈటల జమున, నితిన్రెడ్డికి అధికారులు నోటీసులు ఇచ్చారు.