తుర్కపల్లి, నవంబర్ 16: దళితబంధు పథకంలో భాగంగా మంజూరైన నిధులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మం డలం వాసాలమర్రిలో మంగళవారం లబ్ధిదారులు జెర్రిపోతుల భాగ్యమ్మ, జెర్రిపోతుల ప్రియాంక.. పౌల్ట్రీఫామ్ షెడ్లకు ముగ్గుపోసుకున్నారు. అంతకుముందు స్థానిక ఎస్సీ హాస్టల్లో పౌల్ట్రీ, పాడిపరిశ్రమ లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, పశు సంవర్ధక శాఖ జేడీ కృష్ణ అవగాహన కల్పించారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా దళితులు ఉన్నతంగా ఎదిగి ఇతరులకు ఆదర్శంగా నిలువాలని కోరారు.
10 మందికి పౌల్ట్రీ పరిశ్రమలు మంజూరయ్యాయని, మిగిలిన 8 మందికి త్వరలోనే పౌల్ట్రీఫామ్ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. దళితుల బతుకులు బాగు చేసిన సీఎం కేసీఆర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటామని జెర్రిపోతుల ప్రియాంక సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న తాను ఇప్పుడు పౌల్ట్రీఫామ్కు ఓనరునవుతున్నానంటే సీఎం కేసీఆర్ సార్ వల్లనేనని జెర్రిపోతుల భాగ్యమ్మ సంబురంగా తెలిపింది. కార్యక్రమంలో సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎస్సీ కార్పొరేషన్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రవణ్కుమార్, వెటర్నరీ డాక్టర్ శ్రీనివాస్రావు పాల్గొన్నారు.