అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను తీరాన్ని తాకే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ మరో మూడు గంటల్లో పూర్తవుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం గులాబ్ తుఫాను కళింగపట్నానికి 25 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. ప్రస్తుతం తీర ప్రాంతంలో 75 కిలోమీటర్ల నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గాలుల వేగం క్రమంగా 95 కిలోమీటర్లకు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. గోపాల్పూర్, కళింగపట్నం మధ్య తీరాన్ని తాకుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
#WATCH | Srikakulam in Andhra Pradesh witnessed strong winds and heavy rainfall due to Cyclone Gulab (Earlier visuals)
— ANI (@ANI) September 26, 2021
As per IMD, the landfall process has commenced in coastal regions of Andhra Pradesh and Odisha pic.twitter.com/RKSLzv5cGs