న్యూఢిల్లీ: జాతీయ కోచ్ ఆర్కే శర్మ తనతో అసభ్యకర రీతిలో ప్రవర్తించినట్లు మేటి మహిళా సైక్లిస్ ఆరోపణ చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఆమె ఫిర్యాదు ఇచ్చింది. దీంతో స్లోవేనియా టూర్లో ఉన్న సైక్లిస్ట్లను వెనక్కి రప్పిస్తున్నారు. రూమ్లోకి దూసుకువచ్చిన కోచ్ శర్మ తనను వేధించినట్లు ఆ సైక్లిస్ట్ తన ఫిర్యాదులో పేర్కొన్నది. మే 29వ తేదీన ఈ ఘటన జరిగింది. తన భార్యగా మారాలంటూ కోచ్ తనను వేధించినట్లు ఆ సైక్లిస్ట్ తన ఫిర్యాదులో తెలిపింది. ఈ నేపథ్యంలో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం భారత బృందాన్ని స్లోవేనియా నుంచి వెనక్కి రమ్మని పిలిపించింది. జూన్ 3వ తేదీన ఆ మహిళా సైక్లిస్ట్ వెనక్కి వచ్చింది. ఈ కేసును విచారించేందుకు శాయ్, సీఎఫ్ఐ రెండు బృందాలుగా విచారిస్తోంది. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించనున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ తెలిపింది. స్లోవేనియా వెళ్లిన బృందంలో మహిళా కోచ్లు లేరు. అందరి క్రీడాకారులు పాస్పోర్ట్లు కావాలని శాయ్ కోరినట్లు సైక్లింగ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మనిందర్ పాల్ సింగ్ తెలిపారు.