హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్లో పప్పు, నూనె గింజల పంటలసాగు విస్తీర్ణం పెరుగుతున్నది. బుధవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 11.65 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయశాఖ వెల్లడించింది. ఇందులో వేరుశనగ 3.06 లక్షల ఎకరాల్లో, శనగ 3.14 లక్షల ఎకరాల్లో సాగైనట్టు తెలిపింది. మొత్తంగా పప్పు పంటలు గతేడాది ఇదే సమయానికి 3.10 లక్షల ఎకరాల్లో సాగు కాగా ప్రస్తుతం 4.01 లక్షల ఎకరాల్లో సాగైనట్టు పేర్కొన్నది. నూనె గింజల సాగు గతేడాది ఇదే సమయానికి 2.03 లక్షల ఎకరాలు కాగా ప్రస్తుతం 3.46 లక్షల ఎకరాల్లో సాగైనట్టు వివరించింది. వరి సాగు విస్తీర్ణం గతేడాది ఇదే సమయానికి 3.07 లక్షల ఎకరాలు కాగా ప్రస్తుతం 1.18 లక్షల ఎకరాల్లో సాగవుతున్నట్టు వెల్లడించింది.