హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): రాజీవ్ స్వగృహ, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, ఇతర గృహనిర్మాణ పథకాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణాలపై గురువారం ఆయన ఉన్నతాధికారులతో బీఆర్కేభవన్లో సమీక్ష నిర్వహించారు. గృహనిర్మాణశాఖ స్పెషల్ సెక్రటరీ సునీల్శర్మ, పురపాలకశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సీఐజీ శేషాద్రి, న్యాయ కార్యదర్శి సంతోష్రెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లు ఎస్ హరీశ్, శర్మన్, అమోయ్కుమార్, ఎం హన్మంతరావు తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.