లండన్: మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. జార్జినా రోడ్రిగేజ్, రోనాల్డో దంపతులకు పుట్టిన కుమారుడు మృతిచెందినట్లు సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలిపారు. రోనాల్డో, రోడ్రిగేజ్ దంపతులకు కవల పిల్లలు కలిగారు. అయితే ఆ కవలల్లో అమ్మాయి ప్రాణాలతో ఉండగా, అబ్బాయి మరణించినట్లు రోనాల్డో ఇన్స్టా పోస్టులో తెలిపారు. అమ్మాయి ప్రాణాలతో ఉండడం తమకు ఆశను, సంతోషాన్ని ఇస్తున్నట్లు చెప్పారు. అబ్బాయిని కోల్పోతే తల్లితండ్రులకు ఎంత వేదన ఉంటుందో తెలుసన్నారు.
అక్టోబర్లో ప్రెగ్నెన్సీ అయినట్లు ఆ జంట ప్రకటించిన విషయం తెలిసిందే. మాంచెస్టర్ యునైటెడ్ యాజమాన్యంతో పాటు జట్టు సభ్యులు రోనాల్డ్ ఇంట జరిగిన విషాదం పట్ల స్పందిస్తూ నివాళి అర్పించారు. రోనాల్డోకు క్రిస్టియానో(11) జూనియర్ అనే కుమారుడు ఉన్నాడు. అతను 2010లో పుట్టాడు. 2017లో ఈవా, మాటియో కవలలకు జన్మనిచ్చారు. 2017లో రోడ్రిగేజ్కు అలానా మార్టినా అనే కుమార్తె కూడా పుట్టింది.