మర్పల్లి : ఆటో ఆటో దొంగిలించిన వ్యక్తి రిమాండ్ వ్యక్తిని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై వెంకటశ్రీను తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కల్ఖోడా గ్రామానికి చెందిన సుంకి మాణిక్యంకు చెందిన టీఎస్34టీ2874 నంబర్ గల ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు దొంగింలించారని రెండు రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో నమ్మదగిన సమాచారం మేరకు నవాబుపేట మండలం, కడిచెర్ల గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ ఆటోను దొంగిలించినట్లు తెలియడంతో అతడిని పట్టుకుని విచారించగా ఆటోను దొంగతనం చేసిన విషయాన్ని ఒప్పకున్నాడు.
దీంతో అతని వద్ద నుంచి ఆటోను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం రాజేంద్రప్రసాద్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.