అబిడ్స్, జనవరి 20 : సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా క్రికెట్ టోర్నీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యువతకు ఫిబ్రవరి 1 నుండి 16 వరకు నిర్వహించనున్నారు. విజయ్నగర్ కాలనీ హాకీ గ్రౌండ్లో నిర్వహించనున్న ఈ టోర్నీకి సంబంధించిన ట్రోఫీ, పోస్టర్లను టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సివిల్ సైప్లె కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, బీసీ కమిషన్ సభ్యులు కిషోర్గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ మహ్మద్ అమీర్, సోషల్ మీడియా కన్వీనర్ జావేద్ పటేల్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా టోర్నీ నిర్వాహకుడు రఫత్ మాట్లాడుతూ, ఈ పోటీలలో పాల్గొనాలనుకునే జట్లు జనవరి 21వ తేదీ నుంచి 31లోపు బషీర్బాగ్లోని బాబూఖాన్ ఎస్టేట్ 16వ అంతస్థులో గల కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ప్రథమ జట్టుకు రూ.లక్ష, ద్వితీయ జట్టుకు రూ.50 వేల బహుమతి, ట్రోఫీ అందజేస్తామన్నారు. ఇతర వివరాలకు 9396261699, 6302457876 నంబర్లలో సంప్రదించాలని కోరారు.