ఇటీవలి కాలంలో మలయాళ చిత్రాలు మంచి విజయం సాధిస్తున్న నేపథ్యంలో ఆ సినిమాలను రీమేక్ చేసేందుకు టాలీవుడ్ హీరోలు క్యూ కడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు కూడా రీమేక్లపై దృష్టి పెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తుండగా, ఈ సినిమా తర్వాత లూసిఫర్ రీమేక్ చేయనున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షెడ్యుల్ ఏప్రిల్ సెకెండ్ వీక్ నుండి మొదలయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు
లూసిఫర్ రీమేక్ చిత్రాన్ని మోహన్ రాజా తెరకెక్కించనుండగా, ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారట. తెలుగు నేటివిటీకి అనుగుణంగా మోహన్ రాజా స్క్రిప్ట్లో మార్పులు చేయగా, చిరంజీవి కూడా ఇంప్రెస్ అయ్యాడట. తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫర్ స్ట్రిప్ట్ చేంజ్ చేయడంతో ఇక సినిమా షూటింగ్ మొదలు పెట్టే పనిలో పడ్డారు మేకర్స్ . ఈ చిత్రంలో సుహాసిని కీలక పాత్ర పోషించనుంది. ఈ సినిమా తర్వాత వేదాళం రీమేక్ కూడా చేయనున్నారు మెగాస్టార్.