మెహిదీపట్నం, డిసెంబర్ 14 : సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గాయని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. ఆసిఫ్నగర్ డివిజన్లోని ఆసిఫ్నగర్, హుమాయూన్నగర్, లంగర్హౌస్, గోల్కొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజల సహకారంతో 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మంగళవారం టోలిచౌకిలోని గోల్డెన్ ఫంక్షన్ ప్యాలెస్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కమిషనర్, పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్.శ్రీనివాస్, ఆసిఫ్నగర్ ఏసీపీ ఆర్జీ.శివమారుతితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్ రెడ్డి, నారాయణ రెడ్డి, శ్రీనివాస్, నాగం రవీందర్, సంతోష్కుమార్, అదనపు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు.