న్యూఢిల్లీ, నవంబర్ 13: దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆవులతో పాటు వాటి పేడ, మూత్రం కీలక పాత్ర పోషించగలవని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. గోమూత్రం, పేడతో ఎరువుల నుంచి ఔషధాల వరకు చాలా తయారుచేయవచ్చని చెప్పారు. ఆవులు, ఎడ్లు లేకపోతే చాలా పనులు జరుగవన్నారు. భోపాల్లో ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్ మహిళా విభాగం సమావేశంలో మాట్లాడుతూ చౌహాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది మధ్యప్రదేశ్ ప్రభుత్వం గోవుల పరిరక్షణకు ఆరుగురు మంత్రులతో ‘కౌ క్యాబినెట్’ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.