అమరావతి : ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, నిత్యం భక్తులతో రద్దీగా ఉండే విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొవిడ్ ఆంక్షలు విధించింది. అమ్మవారి సన్నిధిలో నిత్య అన్నదానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని దేవదాయశాఖను ఆదేశించింది. భక్తులకు ఇబ్బంది లేకుండా ప్యాకెట్ల రూపంలో ప్రసాదం అందజేయనున్నట్లు దేవదాయశాఖ వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పాఠశాలల్లోనూ కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేయలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులను ఆదేశించారు.