న్యూఢిల్లీ : స్పుత్నిక్ వీ అత్యవసర వినియోగం డాక్టర్ రెడ్డీస్ పెట్టుకున్న దరఖాస్తుపై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీ ఎస్సీఓ) బుధవారం భేటీకానుంది. ఇప్పటికే కంపెనీ టీకా భద్రతా డేటా, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఇమ్యునోజెనిసిటీ డేటాను అందజేసింది. హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ పెట్టుకున్న దరఖాస్తుపై గత నెల ఫిబ్రవరి 24న జరిగిన సీడీ ఎస్సీఓ సమావేశమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు అత్యవసర వినియోగానికి అనుమతి డీసీజీఐ అనుమతి ఇచ్చింది.
ఇవాళ జరిగే సమావేశంలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్కు అనుమతి ఇస్తే మూడో టీకా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రారంభమైన టీకా డ్రైవ్ మరింత ముమ్మరం కానుంది. గతేడాది సెప్టెంబర్లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, భారత్లో పంపిణీకి రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)తో ఒప్పందం చేసుకుంది. గమలేయా నేషనల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది.