లండన్ : కరోనా వైరస్ సోకిన వారి రక్తంలో తయారయ్యే యాంటీబాడీలు ఇన్ఫెక్షన్కు గురైన అనంతరం తొమ్మిది నెలల వరకూ శక్తివంతంగా ఉంటాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇటలీలోని ఓ పట్టణానికి చెందిన 2000 మందిని పైగా పరీక్షించిన అనంతరం పరిశోధకులు ఈ వివరాలు తెలిపారు. వైరస్ లక్షణాలు కనిపించిన వారితో పాటు ఎలాంటి లక్షణాలు లేని వారిలోనూ వ్యాధి సోకిన తర్వాత తొమ్మిది నెలల వరకూ కొవిడ్-19 యాంటీబాడీలు అధిక స్ధాయిలో ఉన్నట్టు గుర్తించారు.
గత ఏడాది ఫిబ్రవరిలో కరోనా వైరస్కు గురైన వారిలో 98.8 శాతం మందిలో నవంబర్ వరకూ యాంటీబాడీలు నిలిచిఉన్నాయని ఇటలీలోని యూనిరవ్సిటీ ఆఫ్ పదువా, ఇంపీరియల్ కాలేజ్ లండన్ సంయుక్తంగా చేపట్టిన ఈ అధ్యయనం స్పష్టం చేసింది. అధ్యయన వివరాలు జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్లో ప్రచురితమయ్యాయి. రోగనిరోధక వ్యవస్ధ స్పందన సామర్ధ్యంతో వైరస్ తీవ్రత, లక్షణాలకు ఎలాంటి సంబంధం లేదని తమ అధ్యయనంలో వెల్లడైందని అధ్యయన రచయితీ ఇలరియ దొరిగటి వెల్లడించారు.