భారీవర్షాలకు కేరళలోని అలప్పుజా జిల్లాలోని థకాజీ గ్రామంలో వరద పోటెత్తింది. క్లిష్ట పరిస్థితులను దాటుకుంటూ ఓ జంట.. నిశ్చయించిన ముహుర్తానికే తమ పెళ్లి చేసుకున్నది. వంట పాత్రలో కూర్చుని, స్నేహితుల సాయంతో గుళ్లో ఏర్పాటు చేసిన పెళ్లి వేదికకు చేరుకున్నది. తమది కులాంతర వివాహమని, వధువు వైపు వారు అడ్డుచెప్పడంతో ఈ నెల 5న రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నట్టు దంపతులు ఆకాష్, ఐశ్వర్య తెలిపారు. అయితే, హిందూ సంప్రదాయం ప్రకారం సోమవారం గుళ్లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని, ఇంతలో వరద పోటెత్తినట్టు పేర్కొన్నారు.